వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రుడిపై శాశ్వత మానవ స్థావరాన్ని (మూన్ బేస్) ఏర్పాటు చేసేందుకు నాసా మూడు కొత్త మిషన్లను ప్రకటించింది. ఇందుకోసం సుమారు 20 బిలియన్ల డాలర్లు ఖర్చు కానుందని నాసా అడ్మినిస్ట్రేటర్ జేర్డ్ ఐజాక్మాన్ తెలిపారు. లూనార్ రోవర్లు, డ్రోన్ల సహాయంతో అక్కడ ప్రమాదకర వాతావరణంలో ప్రయోగాలు చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్లో 'బ్లూ మూన్' ల్యాండర్ను చంద్రుడిపైకి పంపనున్నారు. మూడు దశల్లో సాగే ఈ ప్రాజెక్టు ద్వారా 2028 నాటికి ఆస్ట్రోనాట్లను చంద్రుడిపైకి పంపి, 2029-2032 మధ్య పవర్గ్రిడ్తో కూడిన శాశ్వత మౌలిక వసతులను నిర్మించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...

