Back to feed
యూకే మార్కెట్లో ‘పెద్ది’ హవా
Suhana Sharma May 27, 2026 8:48 AM అల్ ఇండియా 10 viewsabout 9 hours ago

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' చిత్రంపై యూకే మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి సంబంధించి.. రిలీజ్కు ముందే అక్కడ 12,500కు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడవడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అమెరికాతో పాటు యూకేలోనూ ఈ సినిమాకు అద్భుతమైన క్రేజ్ కనిపిస్తుండటంతో, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...



