Back to feed
గుంటూరు జీజీహెచ్లో రోగి ఆత్మహత్య
Priya Dasgupta May 30, 2026 7:00 AM గుంటూరు 7 viewsabout 12 hours ago

గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ (కిడ్నీ రోగి), భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన శ్రీనివాస్, ఆసుపత్రి భవనం పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మరణించాడు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్, ఈ నెల 23న ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...


