వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్పై పాక్ గ్యాంగ్స్టర్ కుట్ర

పాకిస్థానీ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టితో సంబంధాలున్నాయనే అనుమానంతో 102 మందిపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) నిఘా పెట్టింది. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 58 బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ సున్నిత సమాచారం, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు వ్యూహం పన్నినట్లు అధికారులు గుర్తించారు.
నిరుద్యోగ యువతకు డబ్బు ఆశ చూపి.. ఫేస్బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తమ ఉగ్ర నెట్వర్క్లోకి లాగుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Comments
Loading comments...