Back to feed
ఐపీఓకు ఓయో పేరెంట్ కంపెనీ
Shivani Joshi Jun 03, 2026 5:56 AM అల్ ఇండియా 8 viewsabout 18 hours ago

గ్లోబల్ ట్రావెల్ టెక్ సంస్థ ఓయో మాతృ సంస్థ 'ప్రిజమ్', ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సేకరించేందుకు సెబీ అనుమతి పొందింది. ఈ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.67 వేల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత డిసెంబరులో కంపెనీ సమర్పించిన ఐపీఓ పత్రాలకు వాటాదారుల ఆమోదం లభించింది. ఈ సరికొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా లభించే నిధులను కంపెనీ భవిష్యత్తు వ్యాపార విస్తరణకు ఉపయోగించనుంది.
Comments
Loading comments...



