వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలో ఆన్లైన్ బెట్టింగ్లో రూ. 12 లక్షలు పోగొట్టుకున్న అంకం క్రాంతికుమార్ (40) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో మానసిక కుంగుబాటుకు గురైన ఆయన, రామారెడ్డి రోడ్డు సమీపంలోని పొదల్లో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు.
ఈ ఘటనతో ఎమ్మార్ కాలనీలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీఐ నరహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

