వార్తలకు తిరిగి వెళ్లండి

నార్వే పర్యటనలో ప్రధాని మోదీని పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నించి, ఓస్లోకు చెందిన జర్నలిస్ట్ హెల్లీ లింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. డిప్లమాటిక్ బ్రీఫింగ్లో మోదీ సమాధానం ఇవ్వకుండా వెళ్లడంపై ఆమె ట్వీట్ చేస్తూ.. వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ను ప్రస్తావించారు.
భారత విదేశాంగ శాఖ ప్రెస్ మీట్లోనూ ఆమె మానవ హక్కులపై ప్రశ్నించగా, ప్రతినిధి సిబి జార్జ్ భారత ప్రజాస్వామ్యాన్ని సమర్థించారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ వివాదంపై ఆమెపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
Comments
Loading comments...

