వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో దోషుల జీవిత ఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడిన వారిపై ఎలాంటి జాలి, సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. 1983లో ముజఫర్పుర్ జిల్లాలో జరిగిన ఈ సామూహిక దాడిపై పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ట్రయల్ కోర్టు, హైకోర్టులు విధించిన శిక్షలు సరైనవేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Comments
Loading comments...

