వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిత్యావసరాల సరఫరా సాధారణంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన భరోసానిచ్చారు.
మంత్రుల బృందం సమావేశంలో పాల్గొన్న ఆయన, రైతుల కోసం ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ నాయకత్వం అద్భుతమని కొనియాడారు.
Comments
Loading comments...

