వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురిని నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు సీనియర్ న్యాయవాది వి. మోహన ఉన్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని కొలీజియం మే 22, 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వచ్చే నెలలో ఇద్దరు సిట్టింగ్ జడ్జిలు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఈ తాజా నియామకాలు కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

