వార్తలకు తిరిగి వెళ్లండి

నైజీరియాలో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్లో మే నెలలో ఇప్పటివరకు 317 మంది అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో మరో 314 మందిని మిలిటరీ అరెస్టు చేసింది.
ఈ ఆపరేషన్ల ద్వారా అపహరణకు గురైన 221 మంది బాధితులను రక్షించినట్లు నైజీరియా మిలిటరీ వెల్లడించింది. అలాగే ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, అక్రమ ఆయిల్ రిఫైనరీ కేంద్రాలను ధ్వంసం చేసి వేల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
Comments
Loading comments...

