Back to feed
పశువుల దొంగల ముఠా కలకలం
Vikram Singh May 29, 2026 5:36 AM ఆదిలాబాద్ 10 views1 day ago

సిరికొండ, తాంసి మండలాల్లో పశువుల దొంగతనాలు పెరిగాయి. పశువులను కొంటామని వ్యాపారుల పేరుతో వచ్చే కొందరు వ్యక్తులు, పగలు గ్రామంలోని పశువులను పరిశీలించి, రాత్రి వేళల్లో వాటిని అపహరిస్తున్నారు.
ఆదివాసీ గ్రామాలే లక్ష్యంగా జరుగుతున్న ఈ చోరీలతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచాలని, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...


