వార్తలకు తిరిగి వెళ్లండి

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైనా, అమావాస్య ప్రభావంతో విద్యార్థుల హాజరు భారీగా తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఒక్కతే పాఠశాలకు రావడం చర్చనీయాంశమైంది. అశుభమని భావించిన తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు వెనుకాడారు.
అమావాస్య రోజు చదువు మంచిది కాదని భావించి చాలా మంది విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పాఠశాలలు వెలవెలబోయాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ రీఓపెనింగ్ తేదీలను మార్చుకున్నాయి.
Comments
Loading comments...

