వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీ రాజకీయాల్లో సరికొత్త రచ్చ!
Sadvika Jun 22, 2026 11:20 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

బిఎస్పీ ప్రభుత్వంలోనే బ్రాహ్మణుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉంటుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ వ్యూహాలు ప్రత్యర్థులను కలవరపెడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
తమ పార్టీ చేపట్టిన బ్రాహ్మణ సామాజికవర్గ ఆకర్షణీయ కార్యక్రమాల పట్ల సమాజ్వాదీ పార్టీ తీవ్ర అసహనంతో ఉందంటూ మాయావతి విమర్శలు గుప్పించారు. యూపీ ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
Comments
Loading comments...