Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నెల్లూరులో ఘోర ప్రమాదం: బోల్తా పడిన టూరిస్ట్ బస్సు!

Ravi Shukla May 28, 2026 7:03 AM నెల్లూరు 7 viewsabout 1 hour ago
నెల్లూరులో ఘోర ప్రమాదం: బోల్తా పడిన టూరిస్ట్ బస్సు! - Udayam Digital
నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఏలూరు నుండి నాగపట్నం వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...