Back to feed
నెల్లూరులో ఘోర ప్రమాదం: బోల్తా పడిన టూరిస్ట్ బస్సు!
Ravi Shukla May 28, 2026 7:03 AM నెల్లూరు 7 viewsabout 1 hour ago

నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఏలూరు నుండి నాగపట్నం వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



