Back to feed
నెల్లూరులో వరుస చోరీలు: భయాందోళనలో ప్రజలు
Kiran Jun 10, 2026 7:06 PM అల్ ఇండియా 9 views5 days ago

నెల్లూరు జిల్లా వెంకటాచలం పరిధిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. రెండు వారాల్లో గణేష్ గార్డెన్, సత్రం గిరిజన కాలనీ, చెముడుగుంట గ్రామాల్లోని ఇళ్లల్లో భారీగా బంగారం, నగదు అపహరణకు గురయ్యాయి.
ఒకే తరహాలో జరుగుతున్న ఈ చోరీల వెనుక ఒకే ముఠా హస్తం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు.. రాత్రి పూట గస్తీ పెంచి, దొంగలను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...


