Back to feed
జాతీయ స్థాయిలో మెరిసిన గ్రామీణ కళాకారుడు!
Harika Jun 13, 2026 5:15 AM పెద్దపల్లి 9 views2 days ago

సుల్తానాబాద్ మండలానికి చెందిన వృద్ధ కళాకారుడు దుర్శెట్టి రామయ్యకు ప్రతిష్టాత్మక జాతీయ సంగీత నాటక అకాడమీ పురస్కారం దక్కింది. 79 ఏళ్ల వయసులోనూ తన తంబురా వాయిద్యంతో జానపద సంగీత విభాగంలో ఆయన చూపిస్తున్న ప్రతిభ అద్వితీయం.
వారసత్వంగా వచ్చిన ఈ విద్యతో అనేక ప్రదర్శనలిస్తూ, రాష్ట్రీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. కళాభిమానుల ప్రశంసలు పొందుతూ నేటి తరం కళాకారులకు రామయ్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Comments
Loading comments...



