వార్తలకు తిరిగి వెళ్లండి

నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య పర్యవేక్షకుల అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎన్వోసీలు, ట్రేడ్ లైసెన్సుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రూ.వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారి ఫైళ్లను పెండింగ్లో పెడుతూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను, ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను తక్కువగా చూపుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. లొంగని వారిని చెత్త తరలింపు పేరుతో బెదిరిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కమిషనర్, రసీదు బుక్కులను స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

