Back to feed
లంచావతారం: ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో!
Harika Jun 12, 2026 9:34 AM మహబూబాబాద్ 10 views3 days ago

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో రూ.45 వేలు లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో రాధిక, ఎంపీఓ యాకయ్యలను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంచర్ అనుమతుల కోసం రూ.లక్ష డిమాండ్ చేయగా, ఇప్పటికే రూ.55 వేలు వసూలు చేశారు.
మిగిలిన మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది. వీరితో పాటు ఎంపీడీవో కుమారుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



