Back to feed
జులైలో ‘తల్లికి వందనం’ పథకం
Radhika Jun 16, 2026 1:13 PM అమరావతి 9 viewsabout 3 hours ago

‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జులై మూడో వారంలో ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’, జులై మూడో వారంలో ‘మెగా పీటీఎం’ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
Comments
Loading comments...



