Back to feed
ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం
Vikram Jun 16, 2026 12:11 PM అమరావతి 7 viewsabout 4 hours ago

సింగపూర్తో ఏపీకి విడదీయలేని బంధం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ గమ్యస్థానమని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.
సింగపూర్లో జరిగిన సీఐఐ రోడ్షోలో ఆయన ప్రసంగించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ అద్భుతమని కొనియాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు.
Comments
Loading comments...



