Back to feed
కన్నకూతురిని చంపిన కేసులో పరారీలో ఉన్న తల్లి అరెస్ట్
Vikram Jun 12, 2026 3:54 AM అల్ ఇండియా 8 views3 days ago

ప్రియుడి మోజులో పడి ఐదేళ్ల కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న తల్లి ప్రియాంక ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ వ్యవహారంలో ప్రియుడు మోహన్ను గతంలోనే అరెస్ట్ చేయగా, అప్పటినుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లింది.
తాజాగా హాసనలో తలదాచుకున్న ప్రియాంకను కాడుగోడి పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకుని నగరానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...


