Back to feed
రాష్ట్రంలో మరో రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు: సీఎం
Priya Singh Jun 01, 2026 5:28 PM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

ఆదిలాబాద్ జిల్లాను గుడిసెలు లేని ప్రాంతంగా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. కాగజ్నగర్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా లక్ష గృహప్రవేశాలు ఉంటాయని తెలిపారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించి 2 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని, అలాగే కేంద్రం ధాన్యం కొనకపోతే జూన్ 15 తర్వాత యుద్ధం తప్పదని హెచ్చరించారు.
Comments
Loading comments...


