వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించగా, సుమారు రూ. 200 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి. మార్కెట్ విలువ ప్రకారం ఇవి వేల కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 16 ప్రాంతాల్లో దాడులు జరిపి, ఆయన అక్రమ సంపాదనకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యోగానికి రాజీనామా చేసి నిజామాబాద్ నుంచి రాజకీయాల్లోకి రావాలని మోహన్ నాయక్ భావిస్తున్నారు. అయితే, ఈ భారీ అవినీతి బాగోతం బయటపడటంతో ఆయన రాజకీయ ప్రవేశానికి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

