వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి (EAC-PM) సభ్యులతో శనివారం కీలక సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం, దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
ఆర్థిక సంస్కరణలకు ఊపునివ్వడం, ప్రజల జీవన-వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడంపై సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఛైర్మన్ ఎస్.మహేంద్ర దేవ్, పూర్తికాల సభ్యులు, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Comments
Loading comments...

