Back to feed
ఎలక్ట్రిక్ ట్యాక్సీ సేవల్లోకి గ్రీన్ ఎస్ఎం
Priya Singh Jun 06, 2026 5:03 AM అల్ ఇండియా 6 viewsabout 6 hours ago

భారత క్యాబ్ మార్కెట్లోకి వియత్నాంకు చెందిన 'గ్రీన్ ఎస్ఎం' సంస్థ ఎంట్రీ ఇచ్చింది. దిల్లీలో కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ, త్వరలోనే దేశంలోని ఇతర మెట్రో నగరాలకు విద్యుత్ వాహన సేవలను విస్తరించనుంది. ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వీరు తమ సేవలను అందిస్తున్నారు.
ప్రయాణికుల భద్రత కోసం ఏఐ పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్లను వాహనాల్లో ఏర్పాటు చేశారు. విన్ఫాస్ట్ ఎస్యూవీలతో నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు విగ్రీన్తో భాగస్వామ్యం కుదుర్చుకుని, విస్తృతమైన ఛార్జింగ్ నెట్వర్క్ను కూడా ఈ సంస్థ సిద్ధం చేస్తోంది.
Comments
Loading comments...


