Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బీజేపీ తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం

Rohit Jun 13, 2026 11:48 AM నల్గొండ 19 views2 days ago
బీజేపీ తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం - Udayam Digital
బీజేపీ ఓటు చోరీతో పాటు సీటు చోరీకి పాల్పడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్యానికే అవమానకరమని, బలం లేని చోట అభ్యర్థిని పోటీలో ఉంచడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. నల్లగొండలో జరిగిన కాంగ్రెస్ సదస్సులో మాట్లాడిన మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...