వార్తలకు తిరిగి వెళ్లండి
భారత ఆర్థిక వ్యవస్థకు మిడిల్ క్లాసే ఇంజిన్

భారత ఆర్థిక వృద్ధికి మధ్యతరగతి ప్రజలే ప్రధాన ఇంజిన్ లాంటి వారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. వచ్చే 2036 నాటికి దేశవ్యాప్తంగా జరిగే మొత్తం వినియోగదారుల ఖర్చుల్లో 96 శాతం వాటా ఈ వర్గానిదే కానుందని ఆమె స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధించడంలో మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తే కీలక పాత్ర పోషించిందని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...