Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకయ్యనాయుడితో నితిన్‌ నబీన్‌ భేటీ

Follow Udayam on Google
Vikram Chandra May 27, 2026 3:42 PM హైదరాబాద్General
వెంకయ్యనాయుడితో నితిన్‌ నబీన్‌ భేటీ - Udayam
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో బీజేపీ జాతీయ నాయకుడు నితిన్‌ నబీన్‌ ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ‘అటల్‌ స్మృతి న్యాస్‌ సొసైటీ’ చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడుతో సొసైటీ చేపట్టాల్సిన భవిష్యత్తు కార్యక్రమాల గురించి ఆయన సుదీర్ఘంగా చర్చించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితాన్ని, దేశానికి ఆయన అందించిన సేవలను, విలువలను గౌరవించి సంరక్షించడమే ఈ సొసైటీ ప్రధాన లక్ష్యం. గత డిసెంబర్ నుంచి వెంకయ్యనాయుడు ఈ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Comments

G
Loading comments...