వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మైలార్దేవ్పల్లి కాటేదాన్ రోడ్డులోని డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. శుక్రవారం డ్రైనేజీని శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికులకు ఇది కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అస్థిపంజరాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుడి గుర్తింపు మరియు మరణానికి గల కారణాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

