Back to feed
మహానాడు: తెలుగువారి ఆత్మవిశ్వాసం పసుపు జెండా
Rohit Singh May 27, 2026 6:19 AM అమరావతి 13 viewsabout 14 hours ago

తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జాతీయ జెండా దేశానికి గౌరవమైతే, పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసమని ఆయన పేర్కొన్నారు. ఈ మహానాడును మహిళలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
Comments
Loading comments...



