వార్తలకు తిరిగి వెళ్లండి

సింగోటం - గోపాల్దిన్నె లింక్ కెనాల్ పనులు ఎనిమిదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. రెండుసార్లు శంకుస్థాపనలు చేసినా, భూసేకరణ పూర్తికాక 40 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. పరిహారం సరిపోవట్లేదని రైతులు అడ్డుకోవడంతో 22.5 కి.మీ మేర చేపట్టాల్సిన పనులు 5 కి.మీకే పరిమితమయ్యాయి.
ప్రభుత్వం ఎకరాకు రూ.5.50 లక్షల వరకే పరిహారం ఇవ్వాలని నిర్ణయించగా, రైతులు రూ.30-40 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

