వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఉన్న వసతులు, పుస్తకాల లభ్యతపై సిబ్బందితో చర్చించారు.
పాఠకులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మెరుగైన సేవలు అందించాలని, అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రంథాలయాలను ఆధునిక విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజిరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

