Back to feed
యూరియా నిల్వలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
Harika Jun 13, 2026 7:19 AM హైదరాబాద్ 16 views2 days ago

తెలంగాణలో వానాకాలం సాగు పెరిగిన నేపథ్యంలో, జూన్ నెలకు 2 లక్షల టన్నులు, ఏప్రిల్ లోటును భర్తీ చేయడానికి అదనంగా 0.47 లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్ర మంత్రి జె.పి. నడ్డాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, సరఫరాలో జాప్యం జరగకుండా ఎరువుల దిగుమతిదారులను అప్రమత్తం చేయాలని ఆయన లేఖలో విన్నవించారు.
Comments
Loading comments...



