Back to feed
వర్సిటీలో చిరుత కలకలం: బోనులో బంధించిన అటవీశాఖ
Ravi Sharma May 25, 2026 7:18 AM తిరుపతి 26 views3 days ago

తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుతపులి కలకలం సృష్టించింది. వర్సిటీ ఆవరణలోని గర్భకోశ వ్యాధుల విభాగంలోకి అకస్మాత్తుగా చొరబడటంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని శ్రమించి చిరుతను బోనులో బంధించారు. దీంతో వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...



