Back to feed
కోహెడ భూసేకరణ: సర్కారు తీరుపై బాధితురాలి ఆగ్రహం
Rohit Jun 11, 2026 2:15 PM హైదరాబాద్ 14 views4 days ago

కోహెడ మార్కెట్ యార్డ్ భూసేకరణపై బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని, తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. "మా ప్రాణాలు తీసుకుంటారా? తీసుకొని భూమి తీసుకోమనండి" అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని లాక్కోవడం దారుణమని, పోలీసులతో దౌర్జన్యంగా తమను అరెస్టు చేయించారని ఆరోపించారు. స్థానిక అధికారులు కూడా తమను నిర్లక్ష్యంగా చూస్తున్నారని, ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు.
Comments
Loading comments...



