Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

దండేపల్లిలో వడదెబ్బతో కూలీ మృతి

Priya Singh May 31, 2026 2:23 AM మంచిర్యాల 0 viewsabout 1 hour ago
దండేపల్లిలో వడదెబ్బతో కూలీ మృతి - Udayam Digital
దండేపల్లి మండలం జైతుగూడకు చెందిన ఆత్రం రాజేశ్ (50) శుక్రవారం కూలీ పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. పని స్థలంలో అస్వస్థతకు లోనైన ఆయన, ఇంటికి వచ్చాక వాంతులు, విరేచనాలతో బాధపడుతూ బాత్రూమ్‌లో స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...