వార్తలకు తిరిగి వెళ్లండి
జులై 19 వరకు కువైట్లో పాస్పోర్ట్, వీసా సేవలు నిలిపివేత

పాలనాపరమైన కారణాల వల్ల జులై 19 వరకు భారతీయుల సాధారణ పాస్పోర్ట్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కువైట్లోని భారత ఎంబసీ ప్రకటించింది. ఈ కాలంలో అన్ని ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు (ICAC) మూసి ఉంటాయన్నారు.
అయితే, కేవలం అత్యవసర కేసుల్లో (తత్కాల్ పాస్పోర్ట్, ఈ-వీసా, సివిల్ ఐడీ గడువు ముగిసే వారు) మాత్రమే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య కాన్సులర్ విభాగం సేవలు అందిస్తుందని స్పష్టం చేసింది.
Comments
Loading comments...