Back to feed
సిరిసిల్లలో చిక్కాల రామారావును పరామర్శించిన కేటీఆర్
Harika Jun 13, 2026 10:26 AM సిరిసిల్ల 27 views2 days ago

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావును కలిసి పరామర్శించారు. చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో, వారి నివాసానికి వెళ్లి అశ్విన్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.
Comments
Loading comments...



