Back to feed
అశ్విన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
Harika Jun 13, 2026 11:37 AM సిరిసిల్ల 17 views2 days ago

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు నివాసానికి వెళ్లి ఆయన కుమారుడు అశ్విన్ రావు మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. అశ్విన్ రావు మరణం తీరని లోటని పేర్కొన్న కేటీఆర్, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ క్లిష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ, అశ్విన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...



