Back to feed
వ్యవసాయ కరెంట్ మీటర్లపై స్పష్టత: రైతు డిస్కామ్ కీలక ప్రకటన
Priya Verma May 30, 2026 9:11 AM హైదరాబాద్ 19 viewsabout 10 hours ago

తెలంగాణలో ఏ రైతు కరెంట్ కనెక్షన్కు మీటర్లు పెట్టబోమని TGRPDCL సీఎండీ ముషారఫ్ అలీ స్పష్టం చేశారు. కేవలం ట్రాన్స్ఫార్మర్ల వరకే విద్యుత్ లెక్కింపు ఉంటుందని, రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే కొత్త డిస్కామ్ ముఖ్య ఉద్దేశమని శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన వెల్లడించారు.
వ్యవసాయ విద్యుత్ అక్రమ మళ్లింపులపై నిఘా పెడతామని ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకే ఈ మూడో డిస్కామ్ను ఏర్పాటు చేశామని, దీనివల్ల రైతులకు నాణ్యమైన సేవలు, మౌలిక వసతులు అందుతాయని వివరించారు.
Comments
Loading comments...


