వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్రమంత్రి కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ల డైరెక్షన్లోనే పనిచేస్తూ నిధులు, ఎన్ఓసీ రాకుండా కిషన్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్కు నిధులు ఇస్తూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని రేవంత్ విమర్శించారు. మెట్రోకు సహకరిస్తే సన్మానిస్తామని, లేదంటే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రధాని మోదీ సూచనలను కూడా కిషన్రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

