Back to feed
సీఎం విజయ్ని కలిసిన ఖుష్బూ: కుమార్తె పెళ్లికి ఆహ్వానం
Ritika Sharma Jun 03, 2026 9:39 AM అల్ ఇండియా 9 viewsabout 14 hours ago

సినీ నటి ఖుష్బూ తన చిన్న కుమార్తె అవంతిక వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఆయన నివాసంలో పెళ్లి పత్రికను అందజేసిన అనంతరం, సీఎం విజయ్ తమను ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఆశీస్సులు అందించారని ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
బిజీ షెడ్యూల్లోనూ సమయం కేటాయించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఖుష్బూ కుమార్తె అవంతిక త్వరలో ‘ఆరంభం’ అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా, ఇటీవల ఖుష్బూ కుటుంబం ప్రధాని మోదీని కూడా కలిసి ఆహ్వాన పత్రికను అందించింది.
Comments
Loading comments...



