Back to feed
దేవాదాయ శాఖలో కీలక నిర్ణయాలు: 26 మంది ఈవోలకు పదోన్నతులు
Vikram Jun 13, 2026 6:53 AM హైదరాబాద్ 13 views2 days ago

తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖలో 26 మంది గ్రేడ్-2 ఈవోలకు గ్రేడ్-1గా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
త్వరలోనే మరిన్ని ప్రమోషన్లు చేపట్టి, దేవాలయాల నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని నియమిస్తామని ఆమె తెలిపారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...



