Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కర్ణాటకలో అధికార మార్పిడి లొల్లి

Ravi Shukla May 26, 2026 9:31 AM అల్ ఇండియా 29 views1 day ago
కర్ణాటకలో అధికార మార్పిడి లొల్లి - Udayam Digital
కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారం నేపథ్యంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన సందర్భంలో అధిష్టానం పిలుపు మేరకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అత్యవసరంగా ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీలోని వివాదాలకు చెక్ పెట్టేందుకు అధినాయకత్వం ఈ భేటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. ఈ చర్చల్లో సీఎం మార్పుతో పాటు మంత్రివర్గ విస్తరణ, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...