Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన

Rohit Singh May 25, 2026 11:03 AM హైదరాబాద్ 22 views2 days ago
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన - Udayam Digital
వైద్యం వికటించి బీఎస్సీ విద్యార్థిని పల్లవి గౌడ్ మృతి చెందడంతో, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు పీజీ వైద్య విద్యార్థి శివశంకర్‌పై దాడికి దిగారు. ఈ దాడిని నిరసిస్తూ గాంధీ దవాఖాన జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి అత్యవసర నిరసన చేపట్టారు. తమకు విధుల్లో తగిన భద్రత కల్పించాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సర్జరీ విఫలం కావడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని పల్లవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...