వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎస్డబ్ల్యూ ఎనర్జీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ (QIP) ద్వారా రూ.4,000 కోట్ల నిధులను సేకరించినట్లు సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ బోర్డు ఒక్కో షేరును రూ.525 చొప్పున మొత్తం 7.61 కోట్ల ఈక్విటీ షేర్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
ఈ ఇష్యూ ధరను నిర్ణయించిన ఫ్లోర్ ప్రైస్ (రూ.534.05) కంటే 1.69 శాతం తగ్గింపుతో (రూ.9.05 తక్కువగా) కేటాయించారు. ఈ నిధులను కంపెనీ భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టుల కోసం ఉపయోగించనుంది.
Comments
Loading comments...

