Back to feed
ప్రమాదకరమైన గుంతలతో జయశంకర్ మైదానం
Harika Jun 13, 2026 9:17 AM భద్రాద్రి కొత్తగూడెం 18 views2 days ago

జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలోని మూలమలుపు వద్ద రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఫిల్టర్ బెడ్ పైపుల పనుల కోసం తవ్విన గుంతలను సక్రమంగా పూడ్చకపోవడం, వర్షాలకు రోడ్డు దెబ్బతినడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో మలుపు వద్ద ఈ గుంతను గుర్తించలేక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత సింగరేణి, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి, తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...



