Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైస్వాల్‌, ఫెర్నాండోకు 25 శాతం జరిమానా

Follow Udayam on Google
Sai Aug 25, 2026 12:29 PM జాతీయంక్రీడలు
జైస్వాల్‌, ఫెర్నాండోకు 25 శాతం జరిమానా - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో ఘర్షణకు దిగిన భారత్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌, పేసర్‌ అసిత ఫెర్నాండోకు మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఇద్దరికీ ఒక్కో డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని లెవల్‌-1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. జైస్వాల్‌ను ఔట్‌ చేసిన అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, తలలు తాకాయి. తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకపోయింది.

Comments

G
Loading comments...