వార్తలకు తిరిగి వెళ్లండి

మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. సమాజానికి సందేశాన్ని, యువతకు స్ఫూర్తినిచ్చేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు.
సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయన అందించిన అక్షర రూపాలు తెలుగు సాహిత్యానికి ఎంతో గర్వకారణమని జగన్ పేర్కొన్నారు. ఆయన సాహిత్య కృషిని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
Comments
Loading comments...

